నేడు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ
జిల్లా కలెక్టర్లతో భట్టి వీడియో కాన్ఫరెన్స్
ది లీడర్స్ డైరీ: ప్రభుత్వ ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఇందులో పాల్గొననున్నారు. గ్రామ సమస్యలను సమగ్రంగా గుర్తించిసందేశం వినిపించి ఆ వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. ప్రతి గ్రామసభలో విడిగా ఫిర్యాదు బిళ్లలను ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యా మలు స్వీకరిస్తారు. గ్రామసభల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమాని మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో, సంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్లను బట్టి అదేశించారు గ్రామసభలో మొదట ముఖ్యమంత్రి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పేర్లను అందరికీ వినిపించేలా చద వాలి రైతుభరోసా లబ్దికారుల పేర్లు, 300 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితాను సభలో చదవాలి. జూన్ నుంచి అందరికీ జీవిత బీమా పథకం అమలు చేయబోతున్న విషయాన్ని తెల పాచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం మీద వారంలో మూడు రోజులు గ్లాస్ పాలు, మూడు రోజులు రాగి జావ ఇస్తారని, ఇంటర్ కళాశాలల విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజన పరకు అమలు చేస్తున్న విషయం తెలపాలి. గ్రామానికి ఎన్ని నిధులు విడుదలయ్యాయనేది సభలో ప్రకటించాలి’
” అని భట్టి తెలిపారు. ప్రతి గ్రామంలో విస్తృత ప్రచారం చేపట్టి గ్రామస్థులందరూ సభలకు హాజరయ్యేలా కూడా లని సీతక్క అధికారులకు సూచించారు.
