Latest Newsమండల సర్పంచుల సంఘం అద్యక్షుడిగా కంధూరి సాయినాద్

మండల సర్పంచుల సంఘం అద్యక్షుడిగా కంధూరి సాయినాద్

Link Copied!

 

మండల సర్పంచుల సంఘం అద్యక్షుడిగా కంధూరి సాయినాద్
నిర్మల్ జిల్లా కుభీర్ మండల సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని మండల సర్పంచులు ఏకగ్రీవంగా అన్నుకున్నారు.ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు కార్యవర్గాన్ని సమిష్టి ఆమోదంతో ఎన్నుకున్నారని సంఘం సలహాదారు సోనారి సర్పంచ్ ఎన్, నరసింహ తెలిపారు.

కందూరి సాయినాధ్ అద్యక్షులుగా గురువారం కుబేర్ లో జరిగిన సర్పంచుల సమావేశంలో కుభీర్ గ్రామ సర్పంచ్ కుందూరి సాయినాథ్ అధ్యక్షులుగా, ఫకీర్ నాయక్ తండా సర్పంచ్ క్రాంతి రాజ్ ఉపాధ్యక్షులుగా ఎంపికయ్యారు.

సర్పంచుల సంఘం కార్యవర్గానికి ప్రధాన కార్యదర్శిగా చాత సర్పంచ్ జూలై దేవేందర్ కోశాధికారిగా, చండి గ్రామ సర్పంచ్ క్రాంతి తాయిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నరసింహ వెల్లడించారు. ఈ సమావేశంలో కుందూరి సాయినాథ్ మాట్లాడుతూ సర్పంచ్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని గ్రామాల అభివృద్ధికి పాటుపడతానని ఆయన పేర్కొన్నారు.

మండలంలోని 42 మంది సర్పంచులకు గాను 22 మంది సర్పంచులు హాజరయ్యారని సాయినాథ్ తెలిపారు అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్, మాజీ జెడ్పిటిసి చంకర్ చౌహాన్ పలువురు మండల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సత్కరించారు. నిన్న బిజెపి సర్పంచులు నేడు కాంగ్రెస్ సర్పంచులు పోటాపోటీగా సర్పంవ్‌ల మన్డల సంఘాలను ఏర్పాటు చేసుకోవడం జరిగినది.

తాజా వార్తలు

Related Articles