మైక్రో ఫైనాన్స్ పేరిట నిరుద్యోగులకు మోసం

ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ఫైనాన్స్ సంస్థ (Micro finance) మోసానికి పాల్పడింది. పట్టణంలోని జాదవ్ కృష్ణ ( Jadhav Krishna ) అనే వ్యక్తి డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట కార్యాలయాన్ని ప్రారంభించారు. తమ కార్యాలయంతో పాటు ఫైనాన్స్ ఇవ్వడం వసూలు చేయడం లాంటి ఉద్యోగాలు ఇస్తామంటూ ఒక్కొక్కరు వద్ద నుంచి రూ. 20వేలు వసూలు చేశారు.

జిల్లా కేంద్రంతోపాటు ఉట్నూర్ ప్రాంతంలో దాదాపు 300 మంది నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. నెలరోజులుగా రేపు మాపు ఉద్యోగం అంటూ డబ్బులు ఇచ్చిన వారిని మభ్యపెడుతూ వచ్చారు. బుధవారం కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో అక్కడికి చేరుకున్నవారు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడిన డిజిటల్ మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు జాదవ్ కృష్ణ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Popular Doctors

0 out of 5

Mandula Samuel – మందుల సామేలు

$110
0 out of 5

బీర్ల ఐలయ్య – Beerla Ilaiah

$110
0 out of 5

బండారి లక్ష్మారెడ్డి – Bandari Lakshma Reddy

$110

Related Articles