
Kunreddy Rajashekar Reddy
తెలంగాణ రాష్ట్రంలో 2025 డిసెంబర్ నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, నల్గొండ జిల్లాలోని గుడిపల్లి మండలం, గుడిపల్లి గ్రామం నుంచి శ్రీ కున్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు గ్రామ సర్పంచ్గా ప్రజల విశ్వాసంతో ఘన విజయం సాధించారు. మొత్తం సుమారు 1,750 ఓట్లు పోలైన ఈ ఎన్నికల్లో, తన సమీప ప్రత్యర్థిపై ఆధిక్యం సాధిస్తూ 1,200కు పైగా ఓట్లు పొందారు. ఈ విజయం గ్రామ ప్రజలు ఆయన నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి, గతంలో గ్రామాభివృద్ధి కోసం చేసిన సేవలకు నిదర్శనంగా నిలిచింది.
1990 డిసెంబర్ 12న జన్మించిన రాజశేఖర్ రెడ్డి గారి తల్లిదండ్రులు శ్రీ కున్రెడ్డి లక్ష్మా రెడ్డి గారు మరియు శ్రీమతి పద్మావతి గారు. కొత్తగా ఏర్పడిన గుడిపల్లి మండల అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు. మండల పరిధిలోని గ్రామాలకు రాకపోకలు సులభం కావాలనే ఉద్దేశంతో చెట్లు, పొదలు తొలగించి రహదారుల అభివృద్ధికి కృషి చేశారు.గుడిపల్లి నుండి కేశంనేనిపల్లి గుడిపల్లి నుండి రోలకల్లు గుడిపల్లి నుండి సూర్య పల్లి గుడిపల్లి నుండి గుడిపల్లి ఎక్స్ రోడ్ గుడిపల్లి నుండి అంగడిపేట ఎక్స్ రోడ్ అభివృద్ధికి విశేష సహకారం అందించారు.
గ్రామాభివృద్ధి కోసం ఎన్నికైన ఏడు నెలలలోపు రూ.20 లక్షల వరకు సొంత నిధులను వెచ్చిస్తూ ఆదర్శ నాయకుడిగా నిలిచారు. ప్రజా సేవ పట్ల ఆయన నిబద్ధత గ్రామ ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధతో ప్రతి బుధవారం జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు సొంత ఖర్చులతో చికెన్ భోజనం ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరుకావడం, వారికి పోషకాహారం అందించడం, పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలను కూడా నిరంతరం చేపడుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో కూడా ఆయన నాయకత్వం స్పష్టంగా కనిపించింది. గ్రామంలోని 10 వార్డుల్లో 8 వార్డుల్లో తన బృందాన్ని విజయవంతం చేయగా, ఉపసర్పంచ్ పదవికి కూడా సమన్వయంతో నాయకత్వం వహించారు. ప్రజా సేవ, గ్రామాభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, సొంత నిధులతో సేవా కార్యక్రమాలు వంటి అనేక రంగాల్లో విశిష్ట సేవలందిస్తూ శ్రీ కున్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు మండల స్థాయిని దాటి జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా ఆదర్శ సర్పంచ్గా గుర్తింపు పొందుతున్నారు. గ్రామం గుడిపల్లి మండల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. కొత్తగా ఏర్పడిన మండలంగా గుడిపల్లి పరిపాలనా పరంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. వరి, పత్తి, మిర్చి తదితర పంటలను రైతులు విస్తృతంగా సాగు చేస్తారు. పశుపోషణ కూడా గ్రామీణ కుటుంబాలకు ఉపాధి వనరుగా ఉంది. గుడిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య సేవలు, తాగునీటి సదుపాయాలు వంటి ప్రాథమిక వసతులు అందుబాటులో ఉన్నాయి. గ్రామంలో రహదారులు, పారిశుద్ధ్యం, హరితహారం, తాగునీటి సదుపాయాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. మండల కేంద్రంగా ఉండటం వల్ల పరిసర గ్రామాల ప్రజలకు ప్రభుత్వ సేవలు, పరిపాలనా కార్యక్రమాలు మరియు అభివృద్ధి పథకాలు అందించడంలో గుడిపల్లి కీలక పాత్ర పోషిస్తోంది.
గ్రామంలో విద్య, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు సామాజిక ఐక్యతకు కూడా ప్రాధాన్యం ఇవ్వబడుతోంది. గ్రామాభివృద్ధి, ప్రజా భాగస్వామ్యం మరియు స్థానిక స్వపరిపాలనలో గుడిపల్లి గ్రామం నల్గొండ జిల్లాలో గుర్తింపు పొందిన గ్రామాల్లో ఒకటిగా నిలుస్తోంది.
