
సీతారాముల కల్యాణానికి గవర్నర్కు ఆహ్వానం
ది లీడర్స్ డైరీ: భద్రాచలంలో ఈ నెల 27న నిర్వహించనున్న శ్రీసీతారాముల కల్యాణ మహో త్సవానికి హాజరుకావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను దేవాదాయ శాఖ ఆహ్వానించింది. మంత్రి కొండా సురేఖ గవర్నర్ను లోక్భవన్లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ అర్చకులు, ఉన్నతాధికారులతో కలిసి ఆహ్వాన పత్రికను గవర్న రు అందించారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైల జారామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు
