
గిరిజన మ్యూజియాన్ని సందర్శించిన కేయూ బృందం
మ్యూజియంలో కళాఖండాలను తిలకిస్తున్న ఆచార్యుల బృందం
ది లీడర్స్ డైరీ : భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియంను కేయూ ఆచార్యుల బృందం ఆదివారం సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆచార్యులు నారాయణ, వెంకటయ్య, కరుణాకర్ రావు, ఆశీర్వాదం, నాగేశ్వరరావు మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధి కోసం వారి సంస్కృతి, సంప్రదాయాలు ఆచార వ్యవహారా లపై కళాఖండాలు, పాత తరం వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేయడం గొప్ప విశేష మన్నారు. మ్యూజియంను భావి తరాలకు తెలిసే విధంగా తీర్చిదిద్దిన పీఓ బి. రాహుల్ సేవలను కొనియాడారు. మ్యూజియం ఇన్ఛార్జి వీరాస్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
