
మోకిల తండా సర్పంచ్పి సస్పెన్షన్ వేటు
ది లీదర్స్ డైరీ : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం, మోకిల తండా సర్పంచ్ వర్థ్య శాంతమ్మపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ ఆరునెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ శాంతమ్మ కుమారుడు బాబు నాయక్, ఆయన అనుచరులు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, గత డిసెంబర్ 25న పంచాయతీ ఆవరణలోని ప్రహరీ, గేటు, టాయిలెట్స్, చెట్లను నరకడం, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసినట్లు పంచాయతీ అధికారి డిసెంబర్ 29న కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, పాలనలో కుటుంబ సభ్యుల జోక్యం, చెట్లను నరకడం నేరమని చెబుతూ జనవరి 12న సర్పంచ్కి షోకాజ్ నోటీసు జారీ చేశారు. సర్పంచ్ 19న సమాధానం ఇవ్వగా పరిశీలించిన కలెక్టర్ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆరు నెలల పాటు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వరకు ఉప సర్పంచ్ సభావత్ కవిత సర్పంచ్ విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.
