
సర్పంచ్ ఆధ్వర్యంలో పురోహితులచే పంచాంగ శ్రవణం
ఈ లీడర్స్ డైరీ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్ ముందు “పరాభవ” నామ సంవత్సర ఉగాది పర్వదినం ను పురస్కరించుకొని సర్పంచ్ నరహరి వెంకట్ రెడ్డి ఆధ్వ ర్యంలో గ్రామ పురోహితులు చారి పంచాంగం శ్రవణం చేశారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ తమ పేర్ల, రాశుల మీద పంచాంగం చూపించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ” పరాభవ” నామ సంవత్సర ఉగాది పండుగ పురస్క రించుకొని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టశ్వర్యాలతో పాడి పంటలతో వర్ధిల్లాల ని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆళ్లముత్యం రెడ్డి, హనుమాన్ టెంపుల్ చైర్మన్ గూడూరి రఘుపతి రెడ్డి, గ్రామ పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలోపాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
