
నిరుద్యోగ యువతకు రాయితీ రుణాలు …
»దరఖాస్తు గడువు ఎప్రిల్ 2కు పెంపు
»యువత సద్వినియోగం చేసుకోవాలి
»ఎస్సీ కార్పొరేషన్ ఈడి పద్మావతి
ది లీడర్స్ డైరీ : షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వయం ఉపాధి కింద పలు యూనిట్లను అందించేందుకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడి పద్మావతి తెలిపారు. అర్హత పత్రాలతో ఏప్రిల్ 2వ తేది వరకు వెబ్సైట్లో దరఖాస్తుచేసుకోవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని అందిపుచ్చు కుని, వివిధ రంగాల్లో యూనిట్లు స్థాపించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆమె ఆకాంక్షించారు.
