Headlinesనేడు కవిత పార్టీ ప్రకటన

నేడు కవిత పార్టీ ప్రకటన

Link Copied!

నేడు కవిత పార్టీ ప్రకటన

మునీరాబాద్లో సభకు ఘనంగా ఏర్పాట్లు

ది లీడర్స్ డైరీ: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఆవిష్క రణ సభ శనివారం జరగనుంది. ఇందుకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్ష న్లో భారీ ఏర్పాట్లు చేశారు. వరంగల్ కాకతీయ కళా తోరణం ఆకృతిలో ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సభా ప్రాంగణంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహంతోపాటు బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పులే, ఆచార్య జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేయ నున్నారు. కవిత శనివారం ఉదయం 7:30 గంటలకు బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరి గన్పా ర్కులో అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు పార్టీ పేరు ప్రకటన తర్వాత… పార్టీ జెండావి ష్కరణ చేస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సభకు వచ్చే అతిథు లకు 34 రకాల తెలంగాణ వంటకా లతో భోజనాలు సిద్ధం చేస్తున్నారు

తాజా వార్తలు

Related Articles