
దేశ పురోగతికి జనాభా లెక్కలు అవసరం
ది లీడర్స్ డైరీ: దేశ పురోగతికి జనాభా లెక్కలు ఎంతో అవసర మని చందన్వెళ్లి సర్పంచ్ చేవెళ్ల నవనీతస్వామి అన్నారు. చంద వారం జనగణన 2027లో భాగంగా గృహాల జాబితా తయారీ, గృహ జన గణన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంగర్భంగా ఆమే మాట్లాడు తూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు వసతుల కల్పన వం టి అంశాలన్నీ జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించబడతాయన్నారు. గ్రామంలో ప్రతి ఇంటి వివరాలు కచ్చితంగా నమోదు కావల్సిన అవసరం ఉందని అన్నారు. గృహ జాబితా తయారీ వచ్చే నెల 9వ తేదీ వరకు కొన సాగుతుందన్నారు. ప్రజలు ఎన్యూమరేటర్లకు పూర్తి సహకారం, సమాచా రం అందించాలన్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, నివాస సమాచారం, వసతుల వివరాలు సరిగ్గా నమోదు చేస్తే ప్రభుత్వానికి గ్రామ అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకునేందుకు సులభమవుతుందన్నారు.
